Telangana Rythu Bharosa Scheme 2025: తెలంగాణ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని తెలియజేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా 12000/- రూ జమ చేయనున్నట్లు తెలియజేసింది. రైతు భరోసా పధకం తరుపున ఈ డబ్బును రైతులకు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రైతులకు రబీ మరియు ఖరీఫ్ కి సంభందించి రెండు సార్లుగా ఇవ్వనున్నారు. రైతుల ఖాతాల్లోకి ఈ పధకం ద్వారా జూన్ 6 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్యలో వేయనున్నట్లు తెలియజేసారు.

ఇంతకు ముందు 3.5 ఎకరాలు వరకు ఉన్న రైతులకు మాత్రమే ఈ పధకం వర్తించే విధంగా రూపొందించి ఇవ్వడం జరిగింది కానీ ఈ సరి మాత్రం 4 ఎకరాలు లేదా అంతకు మించి ఉన్న అర్హత కలిగిన అభ్యర్ద రైతులకి ఈ పధకం వర్తిస్తుంది అని తెలియజేసారు. ఈ విషయాన్నీ 2025 మే 28వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేసారు.
రైతు భరోసా పథకం – అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ
అర్హతలు
- వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి.
- భూమి: ధరణి పోర్టల్లో నమోదు అయి, వ్యవసాయానికి అనుకూలమైన భూమి కలిగి ఉండాలి.
- పట్టాదారులు: అటవీ హక్కుల గుర్తింపు (RoFR) పట్టాదారులు కూడా ఈ పథకానికి అర్హులు.
- అనర్హత భూములు: వాణిజ్య, రియల్ ఎస్టేట్, మైనింగ్ మరియు పరిశ్రమల కోసం వినియోగించే భూములు ఈ పథకానికి అనర్హం.
- అనర్హులు: ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కాదు.
దరఖాస్తు ప్రక్రియ
- ఇప్పటికే పొందినవారు: గతంలో రైతు భరోసా నిధులు పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ప్రభుత్వం వద్దనే ఉంటాయి.
- కొత్త దరఖాస్తుదారులు ఎలా దరఖాస్తు చేయాలి?:
- ఫారం పొందడం: మీ మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా క్లస్టర్ అధికారి ను సంప్రదించి దరఖాస్తు ఫారం పొందాలి.
- ఫారం నింపడం: దరఖాస్తులో రైతు యొక్క వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, భూమి వివరాలు నమోదు చేయాలి.
అవసరమైన పత్రాలు (Required Documents):
పత్రం పేరు | అవసరం వివరాలు |
---|---|
పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ | భూమి వివరాల కోసం |
బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ | నిధులు జమ చేయడానికి |
ఆధార్ కార్డు జిరాక్స్ | గుర్తింపు పత్రం |
- ఎవరికీ సమర్పించాలి: పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారాన్ని వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలి.
స్టేటస్ చెక్ చేయడం ఎలా?
- అధికారిక వెబ్సైట్ను సందర్శించండి: https://www.rythubharosa.telangana.gov.in/Login.aspx
- లాగిన్ విధానం: మీ మొబైల్ నంబర్ ద్వారా ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- స్థితి పరిశీలన: మీ దరఖాస్తు స్థితి, చెల్లింపు వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.

Telangana Rythu Bharosa Scheme 2025 – FAQs
Farmers aged between 18 to 59 years with agricultural land registered on Dharani portal are eligible.
The payment will be credited between June 6 and June 10, 2025.
No, farmers who received benefits previously do not need to reapply as their data is already available with the government.