Talliki Vandanam Scheme Andhra Pradesh 2025: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేయడం జరిగింది. AP కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠామకంగా హామీ ఇచ్చినటువంటి పధకాలు అయినటువంటి సూపర్ సిక్స్ పధకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే విధముగా సన్నాహాలు జరుపుతుంది. వీటిలో ఒకటి అయినటువంటి తల్లికి వందనం పధకం అమలు పరిచే విధముగా ఉన్నట్లు తెలియజేశారు.

ఈ పధకం ఎవరికోసం
తల్లికి వందనం పధకం ముఖ్యంగా పిల్లలు మరియు వారి యొక్క విద్య మరియు వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని రూపొందిచడం జరిగింది. ఈ తల్లికి వందనం పధకం ద్వారా నేరుగా తల్లుల కతాలో డబ్బులను (DBT) పద్దతి ద్వారా జమ చేయడం జరుగుతుంది. ఈ పధకం ద్వారా పిల్లలు మరియు తల్లులు లబ్ది పొందటం జరుగుతుంది.
ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం
తల్లికి వందనం పధకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పధకం ద్వారా ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ పిల్లలను చదివించడానికి ఇబ్బంది పడుతున్న తల్లి తండ్రులకు. మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కులంటుంభాలలోని పిల్లలకు ఈ పధకం కొంతవరకు తోడ్పాటుగా సహాయ పడుతుంది. ఈ పధకం వలన తమ పిల్లలు మెరుగైన విద్యని అందించే అవకాశం తల్లి తండ్రులకు లభిస్తుంది.
ఈ ప్రకటన జారీ చేసింది ఎవరు?
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపిన ప్రకారం, ఈ పథకం జూన్ నెలలో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే తేదీ నుంచే అమలులోకి రానుంది. మంత్రి నారాయణ మాట్లాడుతూ, “తల్లికి వందనం పథకం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టిన సంకేతంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ పధకం ఎప్పటినుండి అమలులోకి వస్తుంది
ఈ తల్లికి వందనం పధకం 2025 జూన్ నెలలో అమలులోకి రావచ్చు అని తెలియజేయడం జరిగింది. కనుక అర్హులయినవారు ఈ పధకాన్ని తప్పకుండా వినియోగిచుకోగలరు.