PM Kisan 20th Installment Date and eKYC Process: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది అది ఏంటంటే 20వ విడుత రైతుభరోసా డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయనుండి, ఇప్పటికే కేంద్రం నుండి 19విడతల వారీగా నేరుగా ఖాతాల్లోకి డబ్బుని జమ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు 20వ విడుత డబ్బులను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ పధకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకి 2000/- రూ. అందించడం జరుగుతుంది.

PM-Kisan 20వ విడత ముఖ్య సమాచారం
అంశం | వివరాలు |
---|---|
పథకం పేరు | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన |
విడత | 20వ విడత |
విడుదల తేదీ | జూన్ 2025 (అంచనా) |
చెల్లింపు మొత్తం | రూ.2000 |
సంవత్సరానికి మొత్తం | రూ.6000 (మూడు విడతలుగా) |
అవసరమైన ప్రక్రియ | eKYC తప్పనిసరి |
అధికారిక వెబ్సైట్ | pmkisan.gov.in |
PM Kisan పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు
ఈ పథకం ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది. eligible రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 మూడు విడతలుగా జమ చేస్తారు. ఈ డబ్బులు వారి ఖాతాలో నేరుగా జమ అవుతాయి. రైతు పేరు మీద సాగు భూమి ఉండాలి, ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఉద్యోగులైతే అర్హత లేదు.
eKYC చేయడం ఎలా?
PM-Kisan 20వ విడత రాబోవడం కోసం eKYC పూర్తి చేయడం తప్పనిసరి. రైతులు రెండు విధాలుగా eKYC చేయవచ్చు:
- OTP ఆధారిత eKYC – అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ద్వారా
- బయోమెట్రిక్ eKYC – మీ ప్రాంతంలోని CSC కేంద్రం ద్వారా
OTP eKYC కోసం మీరు వెబ్సైట్లో ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ధృవీకరణ చేయాలి.
లబ్ధిదారుల జాబితాలో పేరు చూసుకోవడం ఎలా?
రైతులు తాము లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే ‘Beneficiary List’ ఎంపిక చేయాలి. జిల్లా, మండలం, గ్రామ వివరాలు ఇచ్చి ‘Get Report’ క్లిక్ చేస్తే జాబితా కనిపిస్తుంది. అలాగే ‘Beneficiary Status’ ట్యాబ్లో ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేస్తే డబ్బు వస్తుందా లేదానేది చెక్ చేసుకోవచ్చు.
కొత్తగా దరఖాస్తు ఎలా చేయాలి?
ఇంకా నమోదు చేయనవారు అధికారిక వెబ్సైట్కు వెళ్లి ‘New Farmer Registration’ ట్యాబ్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆధార్ నంబర్ నమోదు చేసి, వివరాలు పూర్తిగా ఫిల్ చేసి, సబ్మిట్ చేయాలి. మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవచ్చు.
కావాల్సిన అర్హతలు
PM Kisan పథకంలో డబ్బు పొందాలంటే ఈ క్రింది ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి:
- రైతు పేరున సాగు భూమి ఉండాలి
- చిన్న లేదా సన్నకారు రైతు కావాలి
- ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు
- ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తి కాకూడదు
Official Website Link: pmkisan.gov.in
PM Kisan 20th Installment Date and eKYC Process – FAQs
The 20th installment is expected in June 2025.
Yes, eKYC is compulsory to receive payments.
Visit pmkisan.gov.in and use the ‘Beneficiary Status’ tab.
Yes, farmers can register through ‘New Farmer Registration’ on the official website.
Eligible farmers receive ₹6000 per year in 3 installments.