Fake Ration Cards Scam in Telangana: తెలంగాణ రాష్ట్రములో ప్రజలు ఎంతకాలం నుండో కొత్త రేషన్ కార్డుల నమోదు కొరకు ఎదురు చూస్తున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింగి. అయితే ఈ కార్యక్రమం ఊహించని విధముగా మలుపు తిరిగింది. ఈ కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో కొత్త విషయాలు బయట పడినట్లు తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చిన అక్రమాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున కొత్త కార్డులు జారీ చేస్తుండగా, నకిలీ దరఖాస్తులు పెద్దసంఖ్యలో బయటపడటం అధికార యంత్రాంగాన్ని షాక్కు గురిచేసింది
కేంద్రం నివేదికలో ఎం వెల్లడి అయ్యింది
కేంద్రం యొక్క నివేదికల ప్రకారం అనేక అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. అవి ఏంటంటే కేంద్రం నిర్వహించిన సర్వేలో కామారెడ్డి జిల్లాలో దాదాపు 1700 నాకిలి రేషన్ కార్డులు మంజూరు అయ్యినట్లు గుర్తించారు, అదేవిధముగా మైనర్ల పేరుమీదుగా కూడా కార్డులను జారీ చేసారు మరియు నకిలీ ఆధార్ కార్డులతో దరఖాస్తులు చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 1400 కార్డులను పరిశీలించారు అదే విధముగా 83% పరిశీలనా పూర్తి అయ్యినట్లు కూడా అధికారులు తెలియుజేశారు.
నకిలీ రేషన్ కార్డుల పై రాష్ట్ర అధికారులు ఆందోళన
ఈ నకిలీ రేషన్ కార్డుల స్కామ్ గురించి రాష్ట్ర అధికారులు స్పందిస్తూ, ఒక జిల్లాలోనే ఇటువంటి అక్రమాలు అయితే ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏంటి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధముగా సైలెంట్ కార్డులు (ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డుదారులు) సంఖ్య పెరగడం అనుమానాస్పదంగా ఉందని తెలిపారు, ప్రతి నెల 10 – 15% మంది ప్రజలు ఎందుకు రేషన్ తీసుకోవడం లేదు అనే విషయం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవ్వుతున్నట్లు తెలియజేశారు.
ఈ విషయం పై ప్రభుత్వ ప్రతి స్పందన
ఈ విషయం పై ప్రభుత్వం ప్రతి స్పందిస్తూ అక్రమానికి పాల్పడిన వారి పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే కార్డుల మంజూరు కొనసాగే విధముగా చర్యలు తీసుకోనుంది. ప్రజలు తమ యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ ను మీ సేవ కేంద్రాలలో లేదా తహసీల్దార్ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చు.