EPF Interest Rate Hike 2025: ఉద్యోగం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలియ జేసింది, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎంప్లొయ్ ప్రోవిడెంట్ ఫండ్ ను పెంచడం జరిగింది, పెంచిన వడ్డీ రేటుతో కలుపుకొని 8.25% వడ్డీ రేటును ఈ ఫండ్ మీద ఉద్యోగులు పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది.

EPF 2025 వడ్డీ రేటు పెంపు వివరాలు
అంశం | వివరాలు |
---|---|
లబ్ధిదారులు | ఉద్యోగులు (EPF సభ్యులు) |
పాత వడ్డీ రేటు (2023-24) | 8.15% |
పెరిగిన వడ్డీ రేటు | 0.10% |
కొత్త వడ్డీ రేటు (2024-25) | 8.25% |
నిర్ణయం తీసుకున్న సంస్థ | EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ |
ప్రయోజనం పొందే సంవత్సరం | 2025 |
ఎంత వడ్డీ రేటును పెంచారు
కేంద్ర ప్రభుత్వం ఇంతకూ ముందు 2023-24 సంవత్సరానికి గాను 8.15% వడ్డీ రేటును ఇవ్వడం జరిగింది. అయితే దానిని ఇప్పుడు 0.10% పెంచి మొత్తం 8.25% వడ్డీరేటును ఎంప్లొయ్ కి అందేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే 2025 సంవత్సరానికి గాను ఈ వడ్డీ రేటును ఉద్యోగులు పొందే అవకాశం ఉంది.
ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజెషన్ సెంట్రల్ బోర్డు అఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ 8.25% వడ్డీ రేటును నిర్ణయించడం జరిగింది.